బలవంతంగా ఇంజక్షన్
నెల్లూరు : కోర్టు ప్రాంగణంలో భార్యకు బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చి భర్త పరారయ్యాడు. విడాకుల కేసులో భాగంగా న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు కిశోర్, మంజులాదేవి అనే భార్యాభర్తలు కోర్టుకు వచ్చారు. అక్కడ మంజులాదేవి మెడ మీద బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చి కిశోర్ పరారయ్యాడు. అది హెచ్ ఐ వీ ఇంజక్షన్ అని బందువులు ఆరోపిస్తున్నారు. మంజులాదేవిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News Posted: 9 February, 2010
|