ఉరుసు, గంధోత్సవాలు ప్రారంభం
నెల్లూరు : జిల్లాలోని ఎ ఎస్ పేటలోని శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో ఉరుసు, గంధోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గలేఫ్ ఊరేగింపుతో ఈ ఉత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఉరుసు ఉత్సవంలో అత్యంత ప్రధానమైన గంధ మహోత్సవం ఈ నెల 12 తేదీ రాత్రి జరగనుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ముస్లీంలు ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
News Posted: 8 March, 2010
|