ఆవంత్సకి లోక్ నాయక్ పురస్కారం
విశాఖపట్నం : ప్రతిష్ఠాత్మక లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారాన్నిఅభ్యుదయ కవి, రచయిత అయిన ఆవంత్స సోమసుందర్ కి జనవరి 18న విశాఖలో ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు యార్లగడడ్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. 2003 నుంచి మాలతీ చందూర్, బోయి భీమన్న, వాసిరెడ్డి సీతాదేవి, కాళీ పట్నం రామారావు, రావూరి భరద్వాజలకు ఈ అవార్డు ఇచ్చారు. అవార్డు కింద లక్ష రూపాయల నగదు పురస్కారాన్నిఅందజేసేవారు. గత సంవత్సరం నుండి ఈ నగదు మొత్తాన్ని లక్షా పాతికవేలకు పెంచినట్లు నిర్వాహకులు చెప్పారు.
News Posted: 24 November, 2009
|