నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ పట్టణంలోని హెచ్ పి గ్యాస్ డీలర్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వ సంస్థకు చెందిన అఖిల భారత వ్యాపారాభివృద్ధి సంఘం జరిపిన సర్వేలో హర్ నాథ్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినందుకు ఎఛీవర్స్ ఎక్సలెన్స్ ఫర్ బెస్ట్ సర్వీస్ ఆవార్డ్ వరించింది. ఈ నెల 18న ఈ అవార్డు ఢిల్లీలో హరనాథ్ కు ప్రదానం చేయనున్నారు.