ఏలూరు : జిల్లాలో పంచాయతీలకు నూతన భవనాలు నిర్మణానికి నిధులు మంజూరయ్యాయి. ఉపాధి నిధులతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. పక్కా భవనాలు లేని 100 పంచాయతీలకు హంగులు సమకూర్చనున్నారు. ఆదర్శ గ్రామాల నిధులతో రెండో విడత మిగిలిన 46 పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు.