'అనూష కేసులో వైఫల్యం లేదు'
రాజమండ్రి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అనూష కేసులో తమ వైఫల్యం లేదని దర్యాప్తు అధికారి, సీఐ ప్రసన్న కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించి దర్యాప్తులో గాని, ఛార్జి షీటులో గాని తాము ఎటువంటి అలసత్వం వహించలేదని ఆయన స్పష్టం చేసారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు తాము వెనువెంటనే స్పందించి దర్యాప్తు సాగించి నిందుతుడికి శిక్ష పడేలా చేసామని ఆయన వివరించారు.
News Posted: 17 January, 2010
|