కరీంనగర్ : నగరంలో కొత్తగా మరో పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది. నగరంలో శాంతిభద్రతలను మరింత మెరుగు పరిచేందుకు త్రీ టౌన్ స్టేషన్ ఏర్పాటు చేసారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న స్టేషన్ ఏర్పాటుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ స్టేషన్ లో సీ ఐ స్థాయి అధికారిని కూడా నియామకం చేస్తున్నారు. ఆలాగే ఒక ఎస్ ఐ తో పాటుగా 30 మంది సిబ్బందిని కూడా నియమించారు. ఈ నెల 26న స్టేషన్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.