రాజేష్ మళ్లీ జైలుకు..
రాజమండ్రి : అనూషపై దాడి చేసి ఆమె తల్లితండ్రులను హతమార్చిన ఉన్మాది మట్టా రాజేశ్ ను పోలీసులు మళ్లీ జైలుకు పంపారు. ఈ నెల 12 న అతనికి బెయిల్ లభించడంతో విడుదల అయ్యాడు. అయితే రాజేశ్ విడుదల కారణంగా తనకు, తన చెల్లెల్లకు ప్రాణపాయం పొంచి ఉందని డీఎస్పీకి, ఆర్డీఓకు అనూష వినతిపత్రం అందచేసింది. అంతేగాక రాజేష్ విడుదలపై రాష్ట్రవ్యాప్తంగా పలు విమర్శలు రావడంతో పోలీసులు 19న రివిజన్ పిటీషన్ దాఖలు చేసారు. రాజేశ్ బెయిల్ రద్దు కావచ్చనే భావనతో పోలీసులు ముందస్తుగానే నిందుతుడును అదుపులోకి తీసుకోన్నారు.
News Posted: 21 January, 2010
|