అనంతపురం : జిల్లా నూతన ఎస్పీగా మనీష్ కుమార్ సిన్హాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ దక్షిణ విభాగం డీసీపీగా పని చేస్తున్నారు. గతంలో ఆయన జిల్లాలోని ధర్మవరం ప్రాంతంలో ఏఎస్పీగా విధులు నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం శాంతిభద్రతలు క్షీణించిన తరుణంలో మనీష్ నియామకం ప్రత్యేకతను సంతరించుకుంది.