అనంతపురం : జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ పాలక మండలి సమావేశం ఈ నెల 6 తేదీన జరపనున్నారు. వర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై వివాదం నెలకొంది. దీంతో వర్శిటీలో పాలన స్తంభించిపోయింది. వైస్ ఛాన్సలర్ అక్రమ నియామకాలు చేపట్టారని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నందున వివాదాన్ని పరిష్కరించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరక ఆరు తేదీన పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు.