తూకాల మోసాలపై కేసులు
అనంతపురం : తూనికల్లో మాయాజాలం చేసి వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై తూనికలు, కొలతల శాఖ కొరడా ఝుళిపించింది. నగరంలోని వివిధ దుకాణాలపై అధికారులు దాడులు చేసారు. కొలతల్లో తేడాలు చేని మోసాలు పాల్పడుతున్న వైనాన్ని అధికారులు పసిగట్టి వ్యాపారులపై కేసులు పెట్టారు. జిల్లాలో దాదాపు నలభై కేసులను అధికారులు ఒకే రోజున నమోదు చేయడం విశేషం.
News Posted: 4 February, 2010
|