నిజామాబాద్ : పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ప్రగతి నగర్ లోని ఆయన ఇంటిని విద్యార్థులు చుట్టిముట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్ధులను అడ్డుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో బాగంగా డీ ఎస్ తన పదవిని వదులుకోవాలని విద్యార్థులు నినాదాలు చేసారు. పదవులను వీడి తెలంగాణ ఉద్యమంలోకి తరలి రావాలని ఆయన కోరారు.