కడప : తమ డిమాండ్ లు పరిష్కరించాలంటూ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేసారు. 18 నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనాలను నిలిపివేసారు. రబీ చివర వరకు కేసీ కెనాల్ కు నీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేసారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తమ విన్నపాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని నీరు విడుదల చేయాలని రైతులు కోరారు.