రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా ఆర్టీసీకి మూడు అవార్డులు లభించాయి. 2008-09 సంవత్సరానికి గాను ఇంధన పొదుపులో రీజియన్ కు ప్రథమ స్థానం లభించింది. ఆలాగే డిపోల్లో అత్యధిక కేఎంపీఎల్ సాధించినందుకు అమలాపురం డిపోకు మరో అవార్డు లభించింది. అంతేగాక రాష్ట్రంలోనే అత్యుత్తమ బస్ డ్రైవర్ గా కాకినాడకు చెందిన జి వి రమణ కూడా అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో కీలకమైన మూడు అవార్డలు జిల్లాకే దక్కడంతో ఆర్టీసీలో కోలాహలం నెలకొంది.