డాక్టర్ ఇంటిపై ఏసీబీ దాడి
కరీంనగర్ : హుస్నాబాద్ మండలంలోని పశుసంవర్థక శాఖలో అసిస్టెంట్ సర్జన్ గా పని చేస్తున్న జయరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేసారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సోదాలు సాగించారు. ఈ దాడుల్లో జయరాం అక్రమంగా ఆస్తులు సంపాదించారని నిర్ధారణ అయింది. దాదాపు కోటిన్నర రూపాయల విలువ గల ఆస్తులు ఈ దాడుల్లో బయల్పడ్డాయి. వాటి విలువ ప్రస్తుత మార్కెట్లో మూడున్నర కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు విద్యానగర్ లోని ఆయన ఇంట్లో ఐదు లక్షల నగదు పలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 51 ఎకరాల భూములు, బైదరాబాద్ లో ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.
News Posted: 6 February, 2010
|