బంగారం షాపులో భారీ చోరీ
నెల్లూరు : నగరంలోని ఎస్వీఆర్ ఆన్ లైన్ బులియన్ మర్చంట్స్ దుకాణంలో సోమవారం తెల్లవారు జామున భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు షట్టర్లు బద్దలుకొట్టి దుకాణంలోకి చొరబడి 73 లక్షల రూపాయల నగదు, కోటి రూపాయల విలువైన బంగారం బిస్కెట్లను ఎత్తుకుపోయారు. వ్యాపార కార్యకలాపాలు ముగించుకున్న అనంతరం రాత్రి పొద్దుపోయిన తరువాత దుకాణం యజమాని దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్ళాడు. సోమవారం ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చేసరకి దుకాణం షట్టర్లు విరిగిపోయి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 7 February, 2010
|