'బడ్జెట్ పై చర్చ జరగాలి'
రాజమండ్రి : రానున్న శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ పై ఎంత చర్చ జరిగితే ప్రజలకు అంత మేలు జరుగుతుందని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తి పరిష్కార దిశగా చర్యలు సాగేలా చూడాలని సభ్యులను కోరారు. అనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. దివంగత సీఎం వై ఎస్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
నిబంధనల ప్రకారం సభ 30 రోజులు జరుగుతుందని, సభా సమయాన్ని వృథా కాకుండా సభ్యులు సహకరించాలని కోరారు. రాజ్యాంగ నిబంధనల మేరకు నిర్ణయాలు తీసుకుంటే తప్ప వ్యక్తిగత నిర్ణయాలకు వెళ్లేది లేదని స్ఫష్టం చేసారు. సభలో నాలుగు గంటలు చర్చ జరిగినా మీడీయా పట్టించుకోవడం లేదని, సభ వెలుపుల చిన్న అల్లరి జరిగినా దానికి విశేష ప్రాధాన్యత ఇస్తుండటం పట్ల స్పీకర్ అసంతృప్తిని వ్యక్తం చేసారు.
News Posted: 10 February, 2010
|