అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎస్కేయూ విద్యార్థులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 18న సమైక్యాంధ్ర సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ఎంపీ లగడపాటి రాజగోపాల్ హాజరుకానున్నట్లు ఎస్కేయూ విద్యార్థి సంఘ నాయకులు వెల్లడించారు. శ్రీ కృష్ణ కమిటీని స్వాగతిస్తూ తాము సదస్సు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.