30 యాక్టు అమలు
కరీంనగర్ : జిల్లాలో శుక్రవారం నుండి పోలీసు యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ శివశంకర్ రెడ్డి చెప్పారు. మార్చి 5 తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాక్టు అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలంటే లిఖితపూర్వక అనుమతి తప్పనిసరని ఆయన తెలిపారు. అనుమతిలేకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు.
News Posted: 19 February, 2010
|