రాజమండ్రి : జెట్ ఎయిర్ వేస్ కి చెందిన రాజమండ్రి - హైదరాబాద్ విమానం శుక్రవారం సాయంత్రం గాల్లో చక్కర్లు కొట్టింది. సుమారు 15 నిమిషాల పాటు గాల్లో చక్కర్ల కొట్టడంతో ప్రయాణీకులంతా గందరగోళానికి గురయ్యారు. ఆ తరువాత అది సురక్షితంగా కిందకి దిగడంతో ఆంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ విమానంలో ఎంపీ అరుణ్ కుమార్ తో పాటుగా 30 మంది ప్రయాణీకులు ఉన్నారు.