కరీంనగర్ : జిల్లాలోని జమ్మికుంట తహశీల్దారు సుదర్శనాచారిపై వేటు పడింది. ఆయన్నువిధుల నుండి సస్పెండ్ చేస్తు జిల్లా కలెక్టర్ ఉత్వర్వులు జారీ చేసారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి తహశీల్దారు ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు జరిపిన విచారణలో సుదర్శనాచారి ప్రమేయం వాస్తవమేనని తేలడంతో ఆయనను విధుల నుండి తొలిగించాలని కలెక్టర్ నిర్ణయించారు.