లాయర్లపై దాడికి నిరసన
నిజామాబాద్ : హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద లాయర్లపై జరిగిన దాడికి జిల్లాలో నిరసన వెల్లువెత్తింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సోమవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరిని తప్పుబడుతూ న్యాయవాద సంఘాలు ఆందోళన చేపట్టాయి. భోజన విరామ సమయంలో ఈద్యోగులు ఆర్డీఓ, తహశీల్దారు కార్యాలయాలు ఎదుట నిరసన వ్యక్తం చేసారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేసారు.
News Posted: 8 March, 2010
|