హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు
ఏలూరు : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న హైటెక్ ముఠా పోలీసులకు చిక్కింది. నగరంలోని ఏఎస్ రావు నగర్ లో మాధవి అనే మహిళ చాలాకాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈ మేరకు స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు వ్యభిచార కేంద్రంపై దాడి చేసారు. ముఠాకు చెందిన ఏడుగురు మహిళలు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకరాలు మాధవి తాను పోలీసు అధికారి కోడలినని చెప్పుకుంటూ, ఇంట్లో వ్యభిచారం జరిపేదని పోలీసులు తెలిపారు.
News Posted: 8 March, 2010
|