హైదరాబాద్ : మాజీ మంత్రి మెట్ల సత్యన్నారాయణ మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తూర్పగోదావరి జిల్లాకు చెందిన ఆయన టీడీపీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పీఆర్పీ రాజకీయ వైఫల్యం చెందడంతో మెట్ల మరలా స్వగృహానికి వచ్చేందుకు నిర్ణయించుకున్నారు.