|
|
Articles: TP Features | ఢిల్లీ నుంచి 'కాష్ ట్రాన్స్ఫర్' - Site Administrator
| |
(సుకన్య)
ఆంధ్రప్రదేశ్ లో గత శాసనసభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం పొందిన, వివాదాస్పద 'నగదు బదిలీ' పధకాన్ని ప్రణాళికా సంఘం ఆమోదించింది. ఎన్నికల ప్రకటన వెలువడే దాకా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దాచిపెట్టుకొని మరీ ప్రయోగించిన ఈ నగదు బదిలీ అస్త్రం బ్రహ్మాండంగా పని చేస్తుందని పరిశీలక వర్గాలు భావించినా, ఓట్లు మాత్రం బదిలీ కాలేదు. అయితే ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రభుత్వం కొన్ని వర్గాలకు అమలు చేస్తున్న ఈ పథకాన్ని ప్రణాళిక సంఘం ఆమోదించింది. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, అవినీతి కారణంగా లబ్ధిదారులకు చేరవలసిన మొత్తం ఏడాదికి లక్షా 40 వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అవుతోందని పలువురు సామాజిక వాదులు ఆందోళన చెందుతున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో బ్రెజిల్ లో అమలు చేసిన నగదు బదిలీ వంటి పథకాన్ని మనదేశంలో అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలపై వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న - జాతీయ ప్రసూతి లబ్ధి పథకం, రేషన్ కు బదులుగా నగదు పథకం అమలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.
జాతీయ ప్రసూతి లబ్ధి పథకం కింది 9 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకం కింద గర్భిణికి 6 లేదా 9 నెలల్లో మొత్తం 4, 500 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఈ మొత్తాన్ని పోషకాహారాన్ని తీసుకునేందుకు గర్భిణి వినియోగించడం వల్ల, ఆరోగ్య వంతులైన బిడ్డలు జన్మిస్తారన్నది లక్ష్యం. పేద వర్గాల్లో బాలింతలు పిల్లల్ని వదిలేసి పనులకు వెళ్ళే అవస్థల్ని కూడా ఈ పధకం దూరం చేసే అవకాశం ఉంటుంది. గర్బస్థ శిశువుతో పాటు, నవజాత శిశువులకు కూడా పౌష్టికాహారం అందేందుకు తోడ్పడాలన్నదే ఈ 'ప్రసూతి' పథకం లక్ష్యం. శిశువుల్లో పౌష్టికాహార లోపం ఉన్న జిల్లాలు - నూరింటిలో అమలు చేయాల్సి ఉంటుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|