|
|
Articles: Short Stories | రైతక్క - Site Administrator
| |
(పి. అశోక్ కుమార్)
... నేను రైతునే గానా అంటూ బేంకు మేనింజర్ ను నిలదీసింది పద్మ.'అట్లగాదు. మీ ఆయనను రమ్మను. దీనికో పద్దతుంటది' విసుగ్గా అన్నాడు మేనింజర్. ఎనుక శాంతాడంత లైను. అందరూ తననే చూస్తున్నారు. మేనింజర్ మాటలకు ఎవరో కిసుక్కుమని నవ్వినట్టున్నారు. ఆ నవ్వులు, చూపులు, మాటలు ఒక లెక్కగాదు పద్మకు. ఎన్నడో బండబారిపోయింది ఆమె మనసు. కొద్దిగా బాధ కలిగినా తమాయించుకుని అదే సమాధానం చెప్పింది. మేనింజర్ మరింత విసుగుగా 'పోవమ్మా...పో... నీకు ఇయ్యంపో... ఇవి రైతులకిచ్చే క్రాప్ లోన్లు. పాస్ బుక్కులు గావాలె. నీకు లోను గావాలంటే మీ స్వశక్తి గ్రూపుల తీసుకో...' అన్నాడు.
పద్మ నీరసంగా వచ్చి బేంచి మీద కూర్చుంది. కౌంటర్లో ఒక్కొక్కరు పేర్లు రాయించుకుంటున్నారు. అందరి చేతుల్లో పాస్ బుక్ లు. ప్లాస్టిక్ సంచుల్లో మలిచి అపురూపంగా పట్టుకున్నారు. వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరిగిన అలసట అందరి మొఖాల్లో కనిపిస్తుంది. మేనింజర్ కు మాత్రం కోపంగా ఉంది. వీళ్ళందరూ అలుక జనాలని అప్పులు ఇస్తే రికవరీ కావని అతడి నమ్మకం. ఎమ్మెల్యే మీటింగ్ ఊర్లోనే ఉన్నదని కుదురుగా కూసున్నడు గాని లేకుంటే ఏదో వంక పెట్టి ఇంకోవారం తిప్పుకునేవాడే.
పద్మ వచ్చీపోయే వాళ్ళను దిగులుగా చూసింది. ఎల్లం బ్యాంకులో అటెండర్. ఇంటి పక్కనే ఉంటాడు. సైగచేసి పిలిచింది పద్మ. మందిని పాపుకుంటూ పద్మ దగ్గరికి వచ్చి 'నేను మొన్ననే చెప్పలేదా అక్కా... ఇవి క్రాప్ లోన్లు. నీకు ఇయ్యరని....' అన్నాడు ఎల్లం. పద్మ కండ్లల్ల నీళ్ళు తిరిగినయి. ఏదో చెప్పుదామనుకుంది. పెదవులు వణికినయి. బాధను దిగమింగుకుంది. కొద్దిగా తమాయించుకుని నవ్వుతూ 'ఇయ్యకపోతే ఇయ్యకపోయిరి. పుణ్యానికిత్తండ్రా... అన్న' అన్నది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|