|
|
Articles: TP Features | వలసవాద ఆలోచనకు ఆవల - Site Administrator
| |
(ఆచార్య జయధీర్ తిరుమలరావు)
భాషకు సంబంధించిన మూడు పుస్తకాలను ఇటీవలే చదివాను. సాధారణ పాఠకులకు వాటిని పరిచయం చేయాలని అనిపించింది అవి-
'తెలుగు మఱుగులు' (పునర్ముద్రణ 1992) రచయిత చీమకుర్తి శేషగిరిరావు, ఇతరులు.'
'ప్రాకృత గ్రంథకర్తలూ - ప్రజాసేవానూ'. ప్రథమ ముద్రణ 1993, (పునర్ముద్రణ 1994) రచయిత పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి.
'తెలుగులో పాళి పదాలు' (1990), రచయిత చీమకుర్తి శేషగిరిరావు.
వీటిలో 1, 3 పుస్తకాలను హైదారాబాద్ లో 'తెలుగుగోష్ఠి' సంస్థ ప్రచురించింది. రెండవ పుస్తకాన్ని హైదరాబాద్ లోని 'ప్రాచీ పబ్లికేషన్స్' వారు వేశారు.
ఈ మూడు గ్రంథాలు తెలుగుభాష, తెలుగు పదాల చరిత్ర, వ్యుత్పత్తి, అర్థ విపరిణామం ఇత్యాది ఎన్నో అంశాల గురించి ప్రసక్తిస్తాయి. వీటి రచయితలు తెలుగు భాషా సాహిత్యరంగంలో నిష్ణాతులు. వారు చారిత్రక దృక్పథం కలిగిన పండితులు. జీవితాంతం ఆయా రంగాలలో పనిచేసి తలపండిన ప్రకాండులు. వీరు తెలుగుభాష గురించి లోతైన పరిశీలన చేయడానికి చరిత్ర, భాషాశాస్త్రం, శాసనాలు, ప్రాచీన సాహిత్యం వంటి వాటిని ఆధారం చేసుకుని లోతైన అధ్యయనం చేసి రచనలు చేశారు. అందుకే వీరి ఆలోచనలూ, అభిప్రాయాలూ మనకి అవసరపడతాయి.
ఈ ఇద్దరు రచయితలు ప్రాకృత భాషాచరిత్ర గురించి అధ్యయనం చేశారు. తమ అధ్యయనంలో సంస్కృత గ్రంథాలను కూడా చదివారు. సంస్కృతంపై పట్టుకలిగి ఉన్నారు. అయితే ఇద్దరికీ తెలుగుభాష పట్ల మక్కువ ఎక్కువ. తెలుగు దృష్టి కోణం నుండి పై రెండు భాషలను కలయజూశారు. వీరు చాలామంది సంప్రదాయ సంస్కృతవాదుల దృష్టిని ప్రాకృతభాష వైపు మరల్చడానికి ప్రయత్నించారు. తెలుగు ప్రాకృత భాషల సంబంధ బాంధవ్యాన్ని వెలికి తీశారు. ఏ పండితుడూ వీరి వాదాన్ని ఇంతవరకూ కాదనలేకపోవడం వీరి అధ్యయనానికి నిదర్శనం. ఏ కోశానా వీరు పాక్షిక దృష్టి చూపలేదు. అలాంటి అపప్రథకి చాలా దూరం. అందుకే వీరి అభిప్రాయాలకు విలువ ఏర్పడింది. అయితే, ఈ వాదనని వ్యతిరేకించే సంప్రదాయ వాదులు సైతం మారుమాటాడకపోవడం గమనించాలి. ఇంతకీ వీళ్ళు ఉదాహరణలతో సహా చెప్పిందేమంటే -
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|