|
|
Articles: Recipes | సగ్గుబియ్యం వడలు - Site Administrator
| |
కావలసిన పదార్ధాలు :
సగ్గుబియ్యం : ఒక కప్పు
వేరుశనగపప్పు : ఒక కప్పు
బంగాళా దుంపలు : రెండు
ఉల్లిపాయ : ఒకటి
జీలకర్ర : అర స్పూన్
కారం : 1 టీ స్పూన్
ఉప్పు : తగినంత
జీలకర్ర : అర స్పూన్
పెరుగు : చిన్న కప్పు
నూనె : వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానం : ముందుగా సగ్గుబియ్యాన్ని నీళ్ళలో ఒక గంట పాటు నాన బెట్టుకోవాలి. పచ్చి వేరుశనగపప్పుని మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంపను ఉడకపెట్టి పై పొట్టుతీసి వాటిని మెత్తగా నలపాలి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత నానిన సగ్గుబియ్యానికి మిక్సీ వేసుకున్న వేరుశనగపిండి, బంగాళాదుంపల పొడి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర, పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు చాలకపోతే నీళ్ళు కొంచెం కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. తర్వాత సగ్గుబియ్యం మిశ్రమాన్ని గారెలు వత్తుకున్నట్టు వత్తి నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. అంతే సగ్గు బియ్యం వడలు రెడీ. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|