|
|
Articles: My Thoughts | ఆ మనసుకు కళ్ళుంటే! - Site Administrator
| |
(పి.శివరామకృష్ణ)
కథా రచయిత కొండగాలి భూషణం 'నమ్మిక'లో (నాగావళి కథలు) ఆశ్రమ పాఠశాలలో ఒక గిరిజన బాలిక ఆటపాటలు నచ్చిన అధికారి, ఆ అమ్మాయిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపవలసిందిగా ఆమె తల్లిని అడుగుతాడు. ఇలా వచ్చినవాళ్ళనల్లా నమ్మి, తాము మోసపోతున్నక్రమాన్ని గిరిజన మహిళ బంతెమ్మ నోట ఇలా చెప్పిస్తారు.
'సావుకారొచ్చినాడు, ఆడితోటే ఇక్కడ వొకలు సెప్పడవూ, అందర మందిమీ ఇనడవూ తొలిపాలొచ్చినాది ఆడే...! ఆడేని బావూ! ఈ రాయి మీదెక్కి సెప్పినాడు. గూడందరమందీ ఈ జువ్విసెట్టు నీడన ఇన్నారు. నమ్మినారు. ఒకటు సెపితే నమ్మీసి అందరిమందిమీ పనిసెయ్యడం. ఆడే తెచ్చినాడు.'
'గురువు అందరమందినీ ఈ రాయి మీదనే కూకోబెట్టి ఈ సెట్టు కిందనే సెప్పినాడు. గూడంతా ఇన్నాది. నమ్మినాది. ఇనుకోని నమ్మినపుడే ఎలిపోనారు. ఆడివంతోటిన్నూ అతలాకుతలం అయిపోవడం సూసినానుగానీ అల్ని మరి సూడ్నేదు'.
'అట్నుండొచ్చిన పడమటోడు! ఆడుసొప్పినాడు. ఈ దారి సెట్టూ, పదిమంది కూకున్నిరాయి. మణెమ్మ కడుపుల పడ్డాది. ఆ పడమటోడు, నమ్ముకున్న నన్నూ ఆపదలో పడిపోయిన అందరమందినీ వొదిలేసి అడివిని బూడిద బుగ్గి సేసి మల్లా వత్తాను. పెద్ద పనికెల్తన్నాను అని మరొకసారి పెమాణికం సేసి అతగాడెటు కాసెలిపోనాడో తెలదు!'
'మరిప్పుడు నువ్వొచ్చినావు, నా మణెమ్మ నడిగినావు. నిన్నెందుకు కాదనీయాల?!'
ఇటువంటి కథలన్నీ వేటగాళ్ళు పులులను చంపిన కథలు. కాని పులల ఆత్మకథ తెలుసుకోవడానికి చాలా కష్టపడాలి. వారు తమ భవిష్యత్తు తీర్చిదిద్దుకోడానికి ఓపికగా సాయపడాలి. కాల్పనిక, విషాదాంతగాథలు మనసును కదిలించవచ్చుగానీ, దారి చూపించలేవు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|