|
|
Articles: TP Features | తల్లికి దండకాలు అక్కర్లేదు - Site Administrator
| |
(సామల రమేష్ బాబు)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన 54 ఏళ్ళకు, మరి నాలుగు రోజుల్లో అవతరణ దినోత్సవం జరుగుతుందనగా అక్టోబరు 26న కడపజిల్లా మైదుకూరులో తెలుగుభాషకు జరిగిన అవమానాన్ని సహించని ప్రజలు ఉద్యమించారు. తెలుగు భాషోద్యమ పతాకను చేతబూని, ప్రదర్శనలు చేశారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి తోడుగా ప్రముఖ తెలుగు దినపత్రికల విలేఖరులు చురుగ్గా వ్యవహరించారు. టీవీ ఛానెళ్ళు పదేపదే ఈ సంఘటననను ప్రచారం చేశాయి. ఫలితంగా రాష్ట్రంలోనూ, బయటా తెలుగువారి గుండెలు ఉద్రేకంతో కొట్టుకొన్నాయి. అవమానంతో లబలబలాడాయి. వారిలోని భాషాజాతీయత తలెత్తి నిదిరిస్తున్న చైతన్యాన్ని మేల్కొలిపింది. ఎన్నో చోట్ల తమంతట తాముగా తోచిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. గత దశాబ్దంగా భాషోద్యమం కొద్దికొద్దిగా సాగుతున్న క్రమంలో మైదుకూరు ఉదంతం దానికి గొప్ప నైతికశక్తినిచ్చి దారి చూపింది.
వారంతా భాషోద్యమంలో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వాములు, లేదా సానుభూతిపరులు. మైదుకూరులోని 'సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూలు' యాజమాన్యపు దుర్మార్గం ఆ రోజు బయటపడింది గాని, నిజానికి అంతకు ముందు చాలా కాలంగా జరుగుతున్నదే. ఆ రోజున పిల్లల మెడల్లో వేలాడదీసిన అట్టలు చాలాకాలం నుంచీ ఇందుకు వాడుతున్నవే. ఇలాంటి శిక్షే కాకపోయినా, రకరకాల శిక్షల్ని రాష్ట్రమంతటా ప్రయివేటు యాజమాన్యం క్రింద ఉన్న మిషనరీ, మైనారిటీ ఇంగ్లీషు స్కూళ్ళల్లోనూ, వారిని తలదన్నినట్లుగా అన్ని విషయాల్లో ఉండాలని పోటీపడే తక్కిన ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో పిల్లలకూ, కొండొకచో తల్లిదండ్రులకూ విధిస్తూనే ఉన్నారు. జరిమానాలు వేస్తూనే ఉన్నారు. ఈ విషయాన్ని అప్పుడప్పుడూ ప్రభుత్వ దృష్టికి తెస్తున్నా, మంత్రులూ, అధికారులూ ఏ చర్యా తీసుకోవడం లేదు. 2005 మే 2న తెలుగు భాషోద్యమ సమాఖ్య లేఖకు వెంటనే స్పందినట్లుగా అప్పటి పాఠశాల విద్యాశాఖ మంత్రిణి రాజ్యలక్ష్మి తమ శాఖ ముఖ్యకార్యదర్శికి ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకొన్నారు తప్ప, తర్వాత ఆచరణ అంటూ ఏమీ లేదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|