|
|
Articles: TP Features | 'టి' ఎందుకు ఇస్తుందంటే.. - Site Administrator
| |
(దుర్గం రవీందర్)
విద్యార్థులు ఉద్యమిస్తున్నారని, కె.చంద్రశేఖరరావు నిరాహార దీక్ష చేశాడని, కళాకారులు ఆడి పాడుతున్నారని, పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది కాబట్టి కేంద్రం దిగి వచ్చి తెలంగాణా ఇస్తుంది అనుకోవడం రాజకీయ అపరిణత తప్ప ఇంకోటి కాదు. ఇస్తే గిస్తే దానికి వేరే కారణాలుంటాయి. ఉన్నత స్థాయి రాజకీయ నిర్ణయాలు, ప్రకటనలు అనేక సమీకరణలు సరిచూసుకున్నాకే వెలువడుతాయి. సాధారణంగా పై స్థాయి రాజకీయాలు అధిక శాతం మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే జరుగుతాయి. కొన్నిసార్లు వారి కన్నా ఉన్నత స్థాయి వారు చేసే ఒత్తిడి, ఆదేశాల మేరకు రాజకీయ నిర్ణయాలు జరుగుతాయి. అంతేకాని క్రింది స్థాయి వారు ఉద్యమించారనో, దీక్షలు చేస్తున్నారనో, సమస్య చాలా కాలంగా నలుగుతున్నదనో, ప్రజలకు లాభిస్తుందనో పై వారు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకుంటే పై వారిని సమస్య నేరుగా తాకదు. వారికి ప్రత్యక్షంగా సమాధానం చెప్పుకునే అవసరం ఉండదు. నష్టం కూడా ఏమీ ఉండదు. రాజ్యానికి మెదడే కాని మనస్సు ఉండదు. తెలంగాణా రాష్ట్ర ప్రకటన వెలువడుతుందని, ఆ ప్రక్రియ మొదలు అవుతుందని భావించడానికి ఉన్న అవకాశాలు ఏమిటో గమనించకుండా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సమస్యపై ఒక అవగాహనకు రావడం కష్టమే అవుతుంది.
తమిళులు శ్రీలంకలో మొదట తమకు సమానావకాశాలు ఇవ్వండి అన్నారు. ఆ తరువాత ప్రత్యేక ప్రతిపత్తి అడిగారు. ఈ సమస్యను శ్రీలంక ప్రభుత్వం ముదరబెట్టాక తమిళ పులులు ఏకంగా తమ దేశం తమకు కావాన్నారు. సమస్య ముదిరాక పలు రకాలుగా సమస్యను పరిష్కరిద్దాం అని శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే సింహాళీయుల చిత్తశుద్ధి లోపం, అధర్మ ధోరణి వల్ల తమిళుల సమస్యలేవీ పరిష్కారం కాలేదు. సరికదా దెబ్బతిన్న ప్రతిసారి రెట్టించిన శక్తితో తమిళులు తిరగబడ్డారు. చివరికి రాజపక్షే తెగబడి తమిళ ఉద్యమకారుల్ని వెతికి వెతికి చంపి సమస్యను అప్పటికి తాత్కాలికంగా చల్లార్చాడు. ఉద్యమకారుల్ని, నాయకులు అందర్నీ చంపడం ద్వారా ఆ సమస్య మళ్ళీ తలెత్తలేదు అని అనుకునేందుకు అవకాశమే లేదు. అది మళ్ళీ తలెత్తుతుంది. కొత్త రూపంలో ముందుకొస్తుంది. కొత్త శక్తితో లేచి కూర్చుంటుంది. తమిళులు అంతగా తెగబడి అసాధరణ రీతిలో సైన్యాన్ని, విమానాలను, పడవలను సమకూర్చుకొని యుద్ధం చేసినా సింహాళీయులు తమిళులకు తలవంచలేదు. వారి డిమాండ్ లను పట్టించుకోలేదు. వారిపట్ల సానుకూల ధోరణిని ప్రదర్శించలేదు.
రాజకీయాల్లో పైనున్న వారి అధికార ధోరణి స్వభావం సాధారణంగా ఇలాగే ఉంటుంది. రాజకీయులలోనే కాదు, స్కూళ్ళలో హెడ్ మాస్టర్లు, ఆఫీసుల్లో అధికారుల ధోరణి ఇలాగే ఉంటుంది. ఇళ్ళల్లో అత్తగార్ల ధోరణి, భర్తల ధోరణి కూడా ఇలాగే ఉంటుంది. బహుశా ఇది అధికారపు సహజ స్వభావం అయి ఉంటుంది. దీన్నే రాజ్య స్వభావం అని కూడా అనుకోవచ్చు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 'కేంద్ర అధికారం' తెలంగాణా విషయంలో ఎందుకు మెత్తబడుతుందని, మెత్తబడింది అని అనుకోవాలి.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|