|
|
Articles: TP Features | రాజుల మాతృభాష ఏమిటి? - Site Administrator
| |
(ఆచార్య ఆర్వీయస్ సుందరం)
శ్రీకృష్ణదేవరాయల మాతృభాష గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఇంకా జరుగుతుంది కూడా. ఇటీవల ఒక కన్నడ పండితుడు నన్ను అడిగాడు 'తెలుగువాళ్ళు ఇటీవల శ్రీకృష్ణదేవరాయల మాతృభాష తెలుగే అని చెప్తుంటారట. దీనికి మీరేదైనా ఆధారం చూపగలరా' అని. 'కన్నడం వాడని చెప్పడానికి మీరేదైనా ఆధారం చూపగలరా' అనే ప్రశ్నకు ఆయన దగ్గరా జవాబు లేదు.
శ్రీకృష్ణదేవరాయల తల్లి తెలుగే మాట్లాడేదని వాళ్ళు బళ్ళారి నుండి తమిళనాడుకు వెళ్ళారని, అందువల్లనే వాళ్ళది తుళువ వంశం అయిందని చెప్పే మాటలని బలపరచడానికి ఏమైనా ఆధారాలున్నాయా? ఒక భాషని అభిమానించడానికి, కావ్యాలు రాయడానికి, పాండిత్యం సంపాదించడానికి ఆ భాష తప్పక మాతృభాషే అయి ఉండాలా? అక్కరలేదనే సమాధానం. అలా అయితే సంస్కృతంలో మహాపండితులయిన వారందరికీ గొప్ప రచయితలలో చాలామందికి అది మాతృభాష కాదు.
రాజుల మాతృభాష గురించి ఎక్కువగా చర్చించడం వ్యర్థం అనిపిస్తుంది. నదుల పుట్టుక గురించి, వీరుల పుట్టుక గురించి, రాజుల పుట్టుక గురించి చెప్పడం చాలా కష్టం. చరిత్రను గమనిస్తే ఎన్నో సందర్భాలలో రాజులు దండయాత్ర చేసినప్పుడు భాష వేరైనా ఇతర రాజుల కుమార్తెలను పెళ్ళాడడం చూస్తాం. ఇతర దేశాల నుంచి వచ్చినవారు కూడా ఇక్కడి రాజకుమార్తెలను పెళ్ళాడిన సందర్భాలున్నాయి. మరి వీళ్ళంతా తల్లితో ఏ భాషలో మాట్లాడేవారు, తండ్రితో ఏ భాష మాట్లాడేవారు? నాకు తెలిసినంతవరకు పురుష ప్రధాన సమాజంలో తండ్రిభాష వ్యవహారభాషగా కొనసాగుతుంది. ఎందుకంటే తండ్రిభాషే దేశభాషగా కూడా ఉంటుంది కాబట్టి. అయితే దీనికి అపవాదాలు కూడా ఉన్నాయి.
శాతవాహనుల మాతృభాష ఏమిటో ఇప్పటికీ తేలలేదు. వారు ఆంధ్రులు లేక ఆంధ్రభృత్యులని పురాణాలు చెప్తున్నాయి. అయితే వాళ్ళు శాసనాలన్నీ ప్రాకృతంలో వేయించారు. కాని నిజానికి ప్రాకృతం దేశభాష కాదు. శాతవాహనులు పరిపాలించిన కాలానికి తెలుగునాడులో తెలుగే మాట్లాడేవారు, కన్నడనాడులో కన్నడమే మాట్లాడేవారు. లేకుంటే హాలుని గాథాసప్తశతిలో తెలుగు పదాలు కన్నడ పదాలూ చేరేవి కావు. శాతవాహనుల రాజధాని పైతాన్ లో మహారాష్ట్రి ప్రాకృతం మాట్లాడేవారేమో!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|