|
|
Articles: Time Pass | బౌద్ధ మార్గం - Venkateswara Rao Madu
| |
గృహస్తులు, భిక్కులతో పాటు పాలకులు ఎలా జీవించాలో కూడా చెప్పాడు బుద్ధుడు. ప్రజలందరినీ సమభావంతో చూస్తూ, న్యాయబద్ధమైన పాలనను అందించటానికి పాలకులకు దానం, శీలం, పరిచ్ఛాగం, అజ్జవం, మద్దవం, తపం, అక్కోధం, అవిహింస, ఖాంతి, అవరోధాలనే పది రకాల ధర్మాలు (దస రాజధమ్మ)ను పేర్కొన్నాడు.
నేటి పాలకులు ఈ పది మంచి గుణాలను అలవర్చుకొంటే సామాజిక న్యాయం దానంతటదే చేకూరుతుంది. పాలకుడైన ప్రతివాడూ, స్వార్థచింతనను వీడి, ఉదార స్వభావంతో, దాన ధర్మాలను చేస్తూ గడపాలి. సచ్ఛీలానికి, ఇవ్వనిదాన్ని తీసుకోకపోవటం, అబద్ధాలడకుండటం, ప్రాణం తీయకుండా ఉండటం, మద్యాన్ని సేవించకుండా ఉండటం, అనైతిక లైంకిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా పంచశీలను పాటిస్తే ప్రజలు ఆ పాలకుడిని ఆదర్శవంతంగా తీసుకుంటారు. స్వార్థాన్ని వీడి, ప్రజల కోసం, సర్వం ధారపోసే త్యాగబుద్ధితో జీవించాలి. ప్రజల బాగోగుల్ని పట్టించుకొంటూ, ఆశ్రిత పక్షపాతం చూపకుండా నీతి, నిజాయితీగా వ్యవహరించాలని బుద్ధుడు సూచించాడు. అతడు సౌమ్యంగా, అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తూ, మృదువుగా గడపాలి. దైనందిన వ్యవహారాల్లో వైయక్తిక నియంత్రణను పాటిస్తూ, విలాసాలను కాదని సాధారణ జీవితం గడపాలి. తోటి పాలకులు, అధికారులు, ప్రజల పట్ల కోపాన్ని గానీ, శత్రుత్వాన్నిగానీ ప్రదర్శించకుండా హింసను నివారించడానికి పూనుకోవాలి. బాధ్యతలు నిర్వర్తించేపుడు ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ శాంతియుత జీవనాన్ని గడపాలి. ప్రజల అభిమతాన్ని తెలుసుకొని వారికి సమ్మతమైన పనులనే చేపట్టాలి. ఈ పది గుణాలతో పాలకులు సైతం సమ్యగ్జీవనాన్ని సాగించాలని బుద్ధుడు బోధించాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|