|
|
Articles: Time Pass | చీకటి టూ చీకటి! - Site Administrator
| |
ఒకటి రెండేళ్ళుగా పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం వల్ల ఉత్పత్తుల అమ్మకాలు తగ్గాయి. లక్షలాది మందిని ఉద్యోగాల నుండి తీసేస్తున్నారు. ఇంకా గ్రామాల్లో ఇళ్లు, పొలాలు ఉన్నవాళ్ళు ఇంటి బాట పడుతున్నారు. భూమిని అమ్మేసుకున్న వాళ్ళు అడ్డా కూలీలుగా మార్కెట్లో పని కోసం పడిగాపులు కాస్తున్నారు.
గత 15-20 ఏళ్ళు పొదుపు సంఘాలు ఉద్యమంగా వ్యాప్తి చెందాయి. ఈ పొదుపు లెక్కలు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టలేదు. ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది. దాని లెక్కడొక్కలు కూడా రేపటి పౌరులు కానున్న నేటి బాలలకు తెలియదు. అంతో ఇంతో భూసంస్కరణలు అమలు చేశామని చెప్పుకునే పశ్చిమబెంగాల్ లోకూడా భూమి లెక్కలు - హక్కులు పాఠ్యాంశం కాదు. అందువల్ల ప్రజలు పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడ్డారు. గ్రామాలవారీగా భూమి లెక్కలు వేసి భూమిని పంచవలసిందిగా ఎక్కడికక్కడ జనం ఒత్తిడి చేయలేకపోయారు. ప్రభుత్వం ఒక విడత భూమి పంపకం చేపట్టింది. భూస్వాముల ఒత్తిడులు తట్టుకోలేక రెండో విడత పంపకం శాశ్వతంగా వాయిదా వేసింది.
పిల్లల చదువు, హక్కుల మీద ఆచార్య శాంతా సిన్హా పనిచేస్తున్నారు. `తల్లిదండ్రులకు కనీస వేతనాలు దక్కకపోతే, పిల్లలను బడికి పంపలేరు. ఏ రంగంలో కనీస వేతనం ఎంతో వాతావరణ నివేదికలాగా ప్రతి పూటా ప్రచార మాధ్యమాలు ప్రకటించాలి' అని ఒకసారి ఆమెతో అన్నాను. `ఈ ఆలోచన అద్భుతంగా ఉంది, పత్రిక, టి.వి.వాళ్ళను పట్టుకొని ప్రారంభిద్దాం' అంటూ ఆమె ఆలోచించసాగారు. తరువాత వారికి పద్మశ్రీ వచ్చింది. జాతీయ స్థాయి పిల్లల కమిషన్ అధ్యక్షురాలయ్యారు. కాని ఎక్కడా కనీస వేతనాల గురించి ఉద్యమస్థాయిలో ప్రచారం చేయాలి అని ప్రకటనలన్నా ఇచ్చినట్లు కూడా ఎక్కడా చూడలేదు. తాము నడిపే స్కూళ్ళల్లోనన్నా ఈ చదువు ప్రవేశపెట్టినట్లు లేదు.
ఎర్ర సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి `ఎర్రసైన్యం' (1992) సినిమాలో ఒక న్యాయవాది కార్యాలయం మీద పడి అక్కడి రికార్డునంతా తగులపెట్టిన దృశ్యం చూపిస్తారు. రికార్డు తగులబడినందుకు రగిలిపోయిన న్యాయవాది, ఆయనను నమ్ముకున్న జనం నక్సలైట్ల నాయకత్వంలో సాయుధపోరాటం బాటపడ్తారు. రికార్డులు ముందుగా పంచి భూమి హక్కుల తనిఖీ చేపట్టాలని ఉద్యమించిన గిరిజనుల మీద భూస్వాములు దాడికి దిగారు. బూసరాజుపల్లి అనే గిరిజన గ్రామం మీద చేసిన దాడిలో గిరిజనులు భూ స్వాములను చితకదన్నారు. భూస్వాములు మరునాడు (ఏప్రిల్ 6, 1996) ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు. జీలుగుమిల్లి మండల రెవిన్యూ కార్యాలయంలో రికార్డునంతా భస్మీపటలం చేశారు. ప్రభుత్వం వివిధ స్థాయిలలో గల తమ కార్యాలయాల్లో రికార్డునంతా సేకరించి, గిరిజనులకు పంచి, బహిరంగంగా హక్కుల తనిఖీ చేపట్టి రికార్డును పునర్నిర్మించే ప్రయత్నం చేసింది.
ఒక రోజు ఆర్.నారాయణమూర్తి హఠాత్తుగా మా హైదరాబాద్ కార్యాలయానికి వచ్చాడు. తన `అడవిబిడ్డలు' సినిమాను రాష్ట్ర సెన్సార్ బోర్డు తిరస్కరించిందని - కేంద్ర సెన్సారు బోర్డు సూచనల మేరకు మళ్ళీ బోర్డు ముందు ప్రదర్శిస్తున్నారని - తన పక్షాన నన్ను ఈ ప్రదర్శనలో, తరువాత జరిగే జ్యూరీ చర్చల్లో పాల్గొనవలసిందిగా కోరారు. ప్రభుత్వం తరఫున నాటి గిరిజన సంక్షేమ కార్యదర్శి నాగిరెడ్డి పాల్గొన్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|