|
|
Articles: TP Features | మహిళలకు భరోసా 'మనదేశీ' - Site Administrator
| |
బ్యాంక్ ల దివాళాకు కారణమయ్యే నిరర్థక ఆస్తులు, మొండి బకాయిలు వంటి పదాలు ఈ బ్యాంకు రికార్డుల్లో కనబడవు. ఈ బ్యాంక్ 98 శాతం రుణాలను వసూలు చేస్తోంది. ఒక్క రోజులోనే తాము ఖాతాదారునికి రుణం మంజూరు చేస్తామని సతారాలోని బ్యాంక్ శాఖ అధికారిణి వనిత ఎమ్ జాదవ్ తెలిపారు. ఇలా ఒక్కరోజులో రుణం పొందినవారిలో వనిత జిలేందర్ పైసే కూడా ఉన్నారు. కాగితపు కప్పుల తయారీ పరిశ్రమను ఒక యంత్రంతో ప్రారంభించిన ఆమె 11 యంత్రాలను ప్రస్తుతం నడుపుతున్నారు. ఆరుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. 2006లో జాతీయ మహిళా సాధికారికత అవార్డును ఆమె ప్రధాని నుంచి స్వీకరించారు.
బ్యాంక్ ప్రతినిధులుగా వ్యవహరించే ఏజెంట్లు, ఖాతాదారుల నుంచి 100 రూపాయలు కూడా రికవరీలో భాగంగా వసూలు చేస్తారు. వాణిజ్య బ్యాంక్ ల నుంచి 7.5 - 8 శాతం వరకు వడ్డీకి రుణాన్ని పొందిన ఈ సహకార బ్యాంకు తన ఖాతాధారులకు స్వల్ప లాభంతో రుణాలు మంజూరు చేస్తోంది. బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందేవారి నుంచి 10 శాతం వడ్డీయే వసూలు చేస్తారు. హామీ లేకుండా తీసుకునే వారి నుంచి 18 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మన దేశీ మహిళా సహకార బ్యాంక్ ను హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ కూడా ప్రోత్సహిస్తున్నట్లు బ్యాంక్ వ్యవస్థాపకురాలు సిన్హా తెలిపారు. అలాగే బ్యాంక్ కు అవసరమైన సాంకేతిక పరమైన సహాయాన్ని డూస్ బ్యాంక్ అందజేస్తోందని చెప్పారు.
బ్రిటన్ లోని బొనేటా ట్రస్ట్ నుంచి మన దేశీ పౌండేషన్ కు నిధుల బదలాయింపు జరుగుతోంది. అన్నట్లు మహిళా బ్యాంక్ ఖాతాదారులకు ఆరోగ్య, జీవిత బీమాను టాటా ఏఐజీ కల్పిస్తోంది. అనేక మంది భాగస్వాముల సహకారంతో తాము మరింత సమర్ధంగా బ్యాంకును నడిపిస్తున్నట్లు బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రేఖా కులకర్ణి పేర్కొనడం గమనార్హం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|