|
|
Articles: Short Stories | చదువూ సంస్కారం - Site Administrator
| |
'నీ తెలివి మండా, సర్కారు బడిలోకంటే, ప్రయివేటు బడిలో సదువుబాగుంటదనే గదా చేర్చినాం...'
'బాగుంటదని ఎవులు చెప్పినారు'
'ప్రైయివేటుబడి నడుపుతున్న సావుకారి..'
'సదువులు బేరమైపోయినాయన్నమాట... ఆ మాట సర్కారు మేస్టర్లు ఎక్కడైనా అన్నారా? ఆ మాట...' రాములమ్మ
'ఆలు... ఏది చెప్పరు...చెబితే మనకెందుకూ ఈగతి..' సీతప్పడు.
'సుబ్బరగ గుంటల్ని గవిరిమెంటుబడిలో చేర్చీద్దాం. నాలుగు తెలుగు ముక్కలైనా నేర్చుకుంతరు. అదీగాక 'మధ్యాహ్న భోజనం' ఇంత పప్పన్నమైనా పెట్టి... ఆ పూట గడుపుతారు' అంది రాములమ్మ.
పకపకా నవ్వాడు సీతప్పడు... 'పప్పు... పప్పా... ఎవరెడతారు. కందిపప్పు 100, మినపప్పు 90, పెసర గిసరా 80 దాటి రేట్లున్నాయి. వంటమనుసలకు జీతాలమాటటుంచి... బిల్లులే చెల్లించరట. చింతపిక్క 50. చారైనా పోయ్యిలేరు. ఆ గంజి మనం పోసుకోలేమేటి? మన పిల్లలకి...' అన్నాడు.
ఈలోగా, పక్క గుడిశలో మోగుతున్న టీవీ దగ్గరకు జారుకున్నారు గుంటలు నలుగురూ.
'పల్లకో... చానా... చెప్పినావు. లోకమంతా ఒక తీరైతే... నీదొక తీరు...' అంది రాములమ్మ.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|