|
|
Articles: My Thoughts | 'ఐచ్ఛికంగానే మాతృభాష' - Site Administrator
| |
దేశమంతా ఒకేరకమైన విద్యావిధానాన్ని, సిలబస్ ను, బోధనా పద్ధతుల్ని, పరీక్షా పద్ధతుల్ని ప్రవేశపెట్టాలనే యశ్ పాల్ కమిటీ గానీ, కపిల్ సిబాల్ నడిపే మానవ వనరుల మంత్రిత్వశాఖ గాని బోధనా భాష సమస్యను దాటవేశారు. దానిపై తమ అభిప్రాయం ప్రకటించకుండా విద్యా సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు. ఈ సుప్రీంకోర్టు తీర్పు తరువాతనైనా దేశంలోని మొత్తం విద్యారంగాన్ని ఒకే విధమైన భాష, సిలబస్, పరీక్షా పద్ధతిలోకి తేవలసి ఉంది. దేశంలోని అన్ని గ్రామాల్లో ఫ్రీ-స్కూలు విద్యావిధానాన్ని (కిండర్ గార్డెన్) ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ విధానం వల్ల ఉదయం 9 గంల నుండి సాయంకాలం 5 గంటల వరకు మూడు సంవత్సరాల వయసుపైబడిన పిల్లలందరినీ ప్రభుత్వం బాధ్యతతో ఫ్రీ-స్కూళ్ళలో విద్య నేర్పించాలి. ఆ సమయంలో వారి పోషణా భారమంతా ప్రభుత్వం చూడాలి. వారి బోధన ఇంగ్లీషు-ప్రాంతీయ భాషలో సమభాగంగా జరపాల్సి ఉంటుంది.
సుప్రీంకోర్టు ఇంగ్లీషు మీడియం విద్యకోసం తల్లితండ్రులు సంవత్సరానికి యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని వ్యాఖ్యానించింది. దాని అర్థం ఏమిటి? బీద ప్రజలకు ఆ విద్యను ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆ బాధ్యతను ప్రభుత్వాలు నెరవేర్చాలంటే ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టకుండా ఎలా సాధ్యమౌతుంది? ప్రజలందరికీ సమన్యాయాన్ని అందించాల్సిన సుప్రీంకోర్టు అందరికీ ఒకే భాషలో చదువుకునే హక్కును కల్పించాలి కదా! ఈ అంశం ఒక ఎన్నికల అజెండాగా మారితే తప్ప బీద పిల్లలను ఇంగ్లీషు నేర్చుకోనిచ్చే పరిస్థితి లేదు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|