|
|
Articles: My Thoughts | చారిత్రక క్షణాలు - Site Administrator
| |
కాని కెసిఆర్ నిరాహారదీక్ష ఆ పరిస్థితినంతటినీ మార్చివేసింది. రాజకీయ నాయకులూ తమ బాణీ మార్చారు. ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అధిష్ఠానవర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రతిఒక్కరూ చెప్పారు. అయితే, ఆ నిర్ణయమేదో తెలిసిన తరువాత వారు సోనియా అధికారాలను ప్రశ్నించనారంభించారు. ఆమెకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏమి తెలుసునని వారు ప్రశ్నించారు. సహజంగానే సోనియా గాంధి పార్టీ భవిష్యత్ ప్రయోజనాల గురించే ఆలోచిస్తారు గాని రాష్ట్ర చరిత్ర గురించి తెలుసుకునేంత తీరిక చేసుకోరు కదా.
ఆ తరువాత సమైక్య ఆంధ్ర ర్యాలీలు ప్రారంభమయ్యాయి. 190 మంది ఆంధ్ర, రాయలసీమ ఎంఎల్ఎలలో 130 మంది శాసనసభకు రాజీనామా చేశారు. 22 మంది మంత్రులు కూడా రాజీనామా చేయాలని యోచించారు. వీలైతే ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయవచ్చు. ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఎవరూ ఊహించలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా, యథాతథంగా ఉంచాలని కోరుతూ భారీ స్థాయిలో ఉద్యమం ప్రారంభమైంది. ఇందుకు కారణాలు ఈ కింద పేర్కొన్నవి కావచ్చు.
మొత్తం రాష్ట్రంలో ఉపాధి కల్పనలో దాదాపు 30 శాతం ఈ ప్రాంతాల నుంచి జరుగుతోంది. రాష్ట్ర జిడిఎస్ పి రూ. 22 వేల కోట్లలో ఐటి రంగం వాటాయే రూ. 8000 కోట్ల మేరకు ఉంది. ఐటి రంగం ప్రధానంగా హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ జనాభా 63 లక్షలలో 40 శాతం మంది ముస్లింలు, 10 శాతం మంది ఆంధ్ర ప్రాంతంవారు కాగా మిగిలినవారు సిసలు తెలంగాణ ప్రాంతం వారు. తెలంగాణ ప్రజలు విపరీతంగా అభిమానం ప్రదర్శిస్తుంటారు. 'వొల్లెలు' లేదా 'ధూతులు' వంటి చిన్న మైలు రాళ్ళకు కూడా వారు వేలాది మంది అతిథులకు ఘనంగా 'దావత్'లు, 'మందు పార్టీలు' ఇస్తుంటారు. విభజన అనేది వారి స్వభావం కాదు. మార్వాడి లేదా గుజరాతీ లేదా ఆంధ్ర ఇలా ఏ సంస్కృతినైనా వారు అలవరచుకుంటుంటారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|