|
|
Articles: TP Features | బౌద్ధం మానసిక ఔషధం - Site Administrator
| |
ఒకదాన్ని నిర్మిద్దామన్నపుడే మరొకటి కులుతోంది. కూలిపోయేదాన్ని గురించి మనం ఆందోళన చెందకూడదు. భారత ఉపఖండంలో మనిషి నిర్మాణం పుట్టిన తరువాత ఎనిమిది సంవత్సరాల లోపు కొన్ని నమ్మకాలతో రూపొందుతుంది. అందువల్ల అతడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఆ నమ్మకాలు అతనిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. మనిషి కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి కాని కొన్ని నమ్మకాలకు కాదు. నమ్మకాలు మనకు పూర్వమైనవి. ప్రతి పూర్వాన్ని ఆధునికం పూర్వపక్షం చేస్తుంది. అంబేడ్కర్ తన బౌద్ధం పునర్నిర్మాణంలో రెండు ప్రధానమైన విశ్వాసాలను ఎదుర్కొన్నాడు. ఒకటి వర్ణతత్వాన్ని ప్రతిపాదిస్తున్న బ్రాహ్మణవాదాన్ని. రెండవది మార్క్సిజం ప్రతిపాదిస్తున్న సాంప్రదాయక దోపిడీ విధానాలను ఎదుర్కొన్నాడు. అంతేగాక బౌద్ధంలో వచ్చిన సంప్రదాయ మత ధోరణులను ఎదుర్కొన్నాడు. అంబేడ్కర్ భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థా పునర్నిర్మాణంలో సాంప్రదాయక బ్రాహ్మణ వాదాన్ని తోసిపుచ్చాడు. ఆయన భారతదేశ చరిత్ర అంటే బ్రాహ్మణవాదానికి బౌద్ధవాదానికి జరిగిన యుద్ధమే అన్నాడు.
మార్క్సిజం భారతీయ బ్రాహ్మణవాదాన్ని అర్థం చేసుకోలేకపోయింది. బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించడం అంటే కేవలం బ్రాహ్మణులను ఎదిరించడం కాదు. బ్రాహ్మణవాదం అంటే అది వర్ణతత్వాన్ని స్థిరీకరించేది. వర్ణతత్వాన్ని మార్క్సిజం ఎదిరించలేపోయింది. సమాజంలో ఆర్థిక పేదరికాన్నే ఎదిరించింది. ఈ పేదరికానికి మూలాలను అంబేడ్కర్ కనుగొన్నాడు. అందుకే ఆయన బౌద్ధ పునర్నిర్మాణంలో నూతన దార్శనికుడయ్యాడు. అంబేడ్కర్ మార్క్సు వాదాన్ని ఇంకా విస్తృతం చేశాడు. మార్క్సిస్టు తాత్వికులు సమాజాన్ని కొత్తగా వ్యాఖ్యానించేవారిగానే ఉన్నారు. కాని దాన్ని మార్చే సూత్రాలు ఇవ్వగలగాలి అన్నారు. కాని అంబేడ్కర్ సమాజాన్ని పునర్నిర్మించగలిగిన వారే తాత్వికులు అన్నారు. మార్క్సిజం అందువల్లే సంస్కరణలకే పరిమితం అవుతూ వెళుతోంది.
బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఆది భారతీయులు పోరాటం చేస్తూనే వచ్చారు. మొదట వర్ణతత్వాన్ని ఎదిరించిన చార్వాకులు దాన్ని ఒక సాంఘిక ఉద్యమంగా నడపలేకపోయారు. చార్వాకం, బ్రహ్మణవాద కర్మకాండల్ని, సాంప్రదాయక వర్ణతత్వ - జీవిత విధానాన్ని ఎదిరించింది. 'బుద్ధితో కూడిన దేహమే ఆత్మ' అని చార్వాకులు చెప్పారు.
విజ్ఞాన ఘన ఏవైతేభ్యో! భూతేభ్యః సముత్థాయ!
తాన్యేవాను వినశ్యతి! నప్రేత్య సంజ్ఞాస్తి!
బృహదారణ్యక శ్రుతి (2-4-12)
నాలుగు భూతముల కలయికతో దేహము, చైతన్యము ఏర్పడుతుందని చార్వాకులు చెప్పారు. (చార్వాక దర్శనం - పేజి 139). ఇది చాలా శాస్త్రీయమైన ఆలోచన. ఈ ఆలోచనల ప్రభావం సంఖ్య శాస్త్రం మీద బుద్ధుని మీద కూడ ఉంది. ఏ తత్వశాస్త్రమైనా కేవలం బోధనలతో వ్యాప్తి చెందదు. తప్పక తాత్విక భూమిక కావాలి. భారత ఉపఖండం తనకు తనదైన తాత్విక పునాది కలిగి ఉంది. ఎండ, నీరు, గాలి, భూమి ప్రకృతులను అర్థం చేసుకొని జీవన విధానాన్ని మలచుకొన్న వారు నేలలో, అడవిలో జీవించినా, నది ఒడ్డున జీవించినా, వీరిది ప్రకృతిని ప్రేమించే గుణం. అందుకు పశు మచ్చిక దశ నుంచి, ఆహార సేకరణ దశ నుంచి, గణ సమాజాల పరిణామం దగ్గర నుంచి నగరీకరణ దశల వరకూ అన్ని దశలనూ ఒకే ప్రాంతంలోను, ఒకే సమయంలోనూ అనువర్తింపబడుతూ ఉండే సమాం భారత సమాజం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|