|
|
Articles: TP Features | కొత్త శక్తి, నూతన ధైర్యం - Site Administrator
| |
స్వామి వివేకానంద తన ఉపన్యాసాలతో మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు. అయితే చిన్నతనం నుంచే వివేకానందుడు ఎంతో బాగా మాట్లాడేవాడు అనడానికి ఒక చక్కని ఉదాహరణ. ఒకసారి వివేకానందుడు క్లాసులో మాస్టారు లేని సమయంలో చుట్టూ ఉన్న స్నేహితులకు ఏదో ఒక విషయం గురించి వివరిస్తున్నాడు. అంతలో మాస్టారు పాఠం చెప్పడానికి వచ్చి, అంతా వివేకానందుడు చెప్పేది శ్రద్ధగా వినటం గమనించారు. మాస్టారు వచ్చిన విషయాన్ని వివేకానందుడు గమనించలేదు. ఆ మాస్టారు వివేకానందుడు ఏం చెబుతున్నాడని ప్రతి పిల్లవాడిని అడగగా వాళ్ళు ఒక్క విషయం కూడా వదలకుండా మాస్టారుకి వివరించేసరికి ఆయన ఆశ్చర్యపోయారట. దానితో వివేకానందలో ఉన్న వాక్పటిమను మాస్టారు గమనించటమే కాదు, వివేకానందుని మాటల్లో అయస్కాంత శక్తి ఉందని ప్రశంసించారు.
1877 - 1879 తండ్రితో కలిసి వివేకానందుడు రాయపూరులో ఉన్నాడు. తర్వాత బ్రహ్మ సమాజంలో సభ్యత్వం తీసుకొని వదిలిపెట్టాడు. దక్షిణేశ్వరం - కాళికాలయంలో పూజారి శ్రీ రామకృష్ణుని కలుసుకున్నాడు. ఆ తరువాత ఆయన ప్రియశిష్యునిగా మారాడు. 1897 మే1 న శ్రీ రామకృష్ణ మిషన్ స్థాపించాడు. 1891లో భారత యాత్ర చేశాడు. 1893లో చికాగో విశ్వమత మహాసభలో ఉపన్యసించి విశ్వ విఖ్యాతి చెందాడు.
చికాగో చిరస్మరణీయత :
1893 సెప్టెంబర్ 11వ తేది - పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో ఇండియా సాంస్కృతిక బంధంలో ఒక కొత్త ఘట్టానికి ప్రారంభ చిహ్నంగా నిలుస్తుంది. ఆ రోజు చికాగో (అమెరికా)లోని పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్లో జరిగిన సమావేశానికి ప్రపంచమంతటి నుండీ ఖ్యాతి పొందిన ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 30 సంవత్సరాల వయసుగల భారతీయుడు శ్రీరామకృష్ణుని శిష్యుడు అయిన స్వామి వివేకానందుడు ఉన్నాడు. పసుపు రంగు దుస్తులు ధరించిన వివేకానందుడు తన పేరుతో సహా అన్ని భౌతిక సంపదలను పరిత్యజించారు. కేవలం సన్యాసి చిహ్నాలు, భగవద్గీత, థామస్ ఏ. కెంపిస్ రచించిన 'ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్' అనే రెండు గ్ర్రంథాలు తప్ప సొంతమనేదేదీ లేకుండా సర్వం విసర్జించారు. ఇండియాలో తన దేశీయులు అనుభవిస్తున్న దుర్భర దారిద్ర్యాన్ని, వేదనను పూర్తిగా అవగతం చేసుకుని వారి జీవితాలలో స్వచ్ఛందంగా, సంపూర్తిగా తాను కూడా భాగం పంచుకున్నాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|