|
|
Articles: TP Features | తెలంగాణ - ఆత్మహత్యలు - Site Administrator
| |
రాజకీయ వాదుల వ్యూహ ప్రతివ్యూహాల ముందు సీమ, ఆంధ్ర వలస పాలకుల దుర్మార్గంలో దోపిడీ పాలనలో ఇక తెలంగాణ రాదు అని తీవ్ర నైరాశ్యానికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న వాదన కూడా ఉంది. ఆంధ్ర వలస పాలకులు పార్టీలకతీతంగా ఏకమై తెలంగాణను అడ్డుకున్న వైనాన్ని, తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకే పార్టీలో ఉంటూ కూడా వేర్వేరుగా, స్వార్థపరులుగా మారిన వైనాన్ని జనం గమనించి తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు. ఇది రాజకీయ వాదులు, సాంస్కృతిక రక్షకుల వైఫల్యం అవుతుంది. దీనికి విద్యార్థులు, యువత మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు.
పెద్దమనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం, చట్టబద్ధమైన ప్రాంతీయ మండలి రద్దు, రాష్ట్రపతి ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పులు, 610 లాంటి ఉత్తర్వులు, ఉద్యమాలు, ఆర్ఎస్ఎస్ వారు, కమ్యూనిస్టులు, నక్సలైట్లు, ఎన్ కౌంటర్లు, చావులు, త్యాగాలు ఇలా అన్నీ నిష్ఫలం అయ్యాయి. తెలంగాణ వారు ప్రజలు రకాలుగా నష్టపోయారు. అందరి ద్వారా వంచనకు గురయ్యారు. తెలంగాణ రాజకీయ నాయకులు కూడా ప్రతిసారి తెలంగాణను వంచిస్తున్నారు. ఒక ఉద్యమం ఆరు దశాబ్దాలుగా నడుస్తున్నది అంటే ఆ ఉద్యమకారుల్లో, ప్రజల్లో నిజాయితీ ఉంది అని అర్థం. ఇంతకాలం కొనసాగుతుంది అంటే నాయకుల్లో నిజాయితీ, సామర్థ్యలోపం ఉంది అని అర్థం. ఉద్యమం ఎగిసి పడినప్పుడల్లా నాయకులు అందులోకి దూరి ఆ ఉద్యమాన్ని స్వప్రయోజనాల కోసం అమ్ముకున్నారు, తాకట్టు పెట్టారు. దీంతో తెలంగాణ వాదుల్లో నైరాశ్యం పెరిగినమాట వాస్తవం.
కొండేటి వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్థి జనవరి 18న ఆత్మహత్య చేసుకోవడం ద్వారా నివురుకప్పినట్లున్న తెలంగాణ ఉద్యమం ఒక్కసారి ఎగసిపడింది. ఇలా తమ మరణం ఉద్యమానికి ఆసరా అవుతుందని నమ్మి కూడా కొందరు ఇలాంటి అఘాయిత్యాలకు, ఆత్మత్యాగాలకు ఒడిగట్టారు. దీన్ని రాజకీయ నాయకులు మహాత్యాగంగా కీర్తిస్తారు. కాని ఇలాంటి త్యాగాల ద్వారా ఒనగూడే ప్రయోజనం ఉన్నా, లేకున్నా దాన్ని ప్రోత్సహించడం అన్యాయం, అమానుషం. అస్తిత్వ ఉద్యమ ఆకాంక్షలను పూర్తిచేయడానికి నిర్మాణాలు ఏర్పర్చుకోవాలి. పునాదులు గట్టిపరుచుకోవాలి. సమస్యల లోతులను అధ్యయనం చేయాలి. ప్రచారం చేయాలి. ఏకం అవ్వాలి. అవతలి వారి దుర్మార్గాలను ఎండగట్టాలి. అంతేకాని ఆత్మహత్యలు చేసుకోవద్దు. రాజ్యం, వలసవాదం ఒక్కటై ఐదు దశాబ్దాలు తెలంగాణలో రాజకీయ హత్యల పర్వం కొనసాగించింది. దీని కొనసాగింపుగానే ఇప్పుడు ఆత్మహత్యల పర్వం మొదలైంది అన్నది కొందరి విశ్లేషణ. ఆత్మహత్యల మృతులలో అత్యధికులు పేదవారైన బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు.
ఉద్యమ ఆకాంక్షను పూర్తి చేసుకోవడానికి అనేక పోరాట, నిరసన రూపాలు వచ్చాయి. సహాయ నిరాకరణ తర్వాత కూడా కొత్త రూపాలు ఎన్నో వచ్చాయి. ఉద్యమకారులు ఇలాంటి రూపాలపై అధ్యయనం చేయాలి. ఆత్మహత్య అంతిమ నిరసన రూపం కాదు. కాని తెలంగాణ రైతులు, వృత్తికులాల వారు ఈ నిరసన ప్రక్రియను ఎంచుకోవడం ఏమిటో గమనించాలి. అంటే ఇతర అన్ని నిరసన, పోరాట రూపాలు కూడా వలస పాలకుల చేతుల్లో ఉపకరణాలుగా మారిపోయాయి. అందుకే రైతన్న ఈ చివరి నిరసనను ఎంచుకుంటున్నాడు కాబోలు. ఏ రీతిగా చూసినా ఆత్మహత్యలు సరైనవి కాదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|