|
|
Articles: TP Features | పెరుగుతున్న అసహనం - Site Administrator
| |
1970 దశకం ఆరంభంలో పశ్చిమ బెంగాల్ లో ఒక చిన్న గ్రూపు వారు 'ఆమ్ర బెంగాలి' నినాదాన్ని లేవదీశారు. అయితే, ఆ గ్రూపునకు రాజకీయంగా తగినంత మద్దతు లభించలేదు. దానితో ఆ ఉద్యమం చప్పబడిపోయింది. ఒక రాష్ట్రంలో అటువంటి విషబీజాలను నాటితే ఇతర భాషా ప్రాతిపదిక రాష్ట్రాలలో, ముఖ్యంగా బెంగాల్, ఒరిస్సా, అసోం, తమిళనాడు, కర్నాటకలలో ఇదే ధోరణి ప్రబలవచ్చు. ఈ తరహా అసహిష్ణుత సంకుచిత ప్రాంతీయ పార్టీకి లబ్ధి చేకూర్చువచ్చు. కాని ఈ రాష్ట్రాలలో ఓట్ల సంపాదనకు ఈ మార్గాన్ని మెజారిటీ పార్టీలు అనుసరించకపోవచ్చు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి), దాని మిత్ర పక్షాలలోని ఛాందసవాదులు హిందూ ఓట్లను పటిష్ఠం చేసుకొనే లక్ష్యంతో బాబ్రీ మసీదు కూల్చివేతకు పాల్పడ్డాయి. ఈ దారుణ కృత్యం బిజెపికి స్వల్పకాలిక ప్రయోజనాలు తెచ్చింది. కాని ఆ పార్టీ తరువాత నష్టపోయింది. ఎందుకంటే ఈ అజెండా దేశ విస్తృత ప్రయోజనాలకు ఉపయోగించదని అత్యధిక సంఖ్యాక ప్రజలు గ్రహించారు. బిజెపి కేంద్రంలో అధికార పార్టీగా కొద్ది కాలం మనుగడ సాగించిందంటే అందుకు అటల్ బిహారి వాజపేయి వ్యక్తిత్వమే కారణం. ఆయన లౌకికవాదిగా పరిగణన పొందారు. ఇప్పుడు బిజెపి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో అది పాలన సాగిస్తున్నదంటే ఆయా ముఖ్యమంత్రుల నాయకత్వ లక్షణాల కారణంగానే కానీ ఢిల్లీలోని బిజెపి కేంద్ర నాయకత్వం వల్ల కాదు. గోధ్రాలో సంఘటనల గురించి జనం అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా నరేంద్ర మోడి సత్పరిపాలన, వ్యక్తిగత నిజాయితీ, చిత్తశుద్ధి కారణంగానే అధికారంలో కొనసాగుతున్నారు. మరి అది బిజెపి ప్రభుత్వమా లేక నరేంద్ర మోడి ప్రభుత్వమా? బహుశా రెండవదే కావచ్చు.
కాంగ్రెస్ పార్టీకి నామమాత్రపు ఉనికి ఉన్న హిందీ భాష ప్రాంతాలతో సహా దేశమంతటా తన బలాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు మహత్తర అవకాశం లభించింది. కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందడానికి అది సంకుచిత దృక్పథాన్ని విడనాడాలి. మత, కుల రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. 'ముందుగా భారతీయుడిని' అనే నినాదంతో అందరినీ తన వైపు ఆకర్షించుకోవాలి. మన దేశం సదా విభిన్న మతాల సమాహారంగా ఉంటున్నదని కాంగ్రెస్ ప్రచారం చేయవలసి ఉంటుంది. వివిధ మతాలు, ప్రాంతాలు, భాషల ప్రజల సాయంతో కాంగ్రెస్ స్వాతంత్ర్యోద్యమాన్ని సాగించింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|