సెల్ టవర్ పై వికలాంగుడు
కావలి : జిల్లాలోని కావలి పట్టణంలో వికలాంగుడొకడు సెల్ టవర్ ఎక్కి కొద్దిసేపు హల్ చల్ చేశాడు. మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. వికలాంగులకు ఇళ్ళ స్థలాల మంజూరులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వికలాంగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రావు మంగళవారం ఉదయాన్నే సెల్ టవర్ ఎక్కాడు. వికలాంగులకు వెంటనే ఇళ్ళ స్థలాలు మంజూరు చేయకపోతే కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ వెంకట్రావు బెదరింపులకు దిగాడు. ఈ విషయంలో అధికారులు తనకు పూర్తి స్థాయి హామీ ఇచ్చే వరకూ టవర్ దిగేది లేదంటూ స్పష్టం చేశాడు. కాగా, వెంకట్రావును టవర్ నుంచి కిందికి దింపేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
News Posted: 3 March, 2009
|