రాజమండ్రి : ప్రజారాజ్యంలో పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతూనే వుంది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన సినీనటుడు కృష్ణంరాజుకు ఎంపీ సీటు ఇవ్వడంతో మొదలైన నిరసనలు తారాస్థాయికి చేరాయి. తూర్పు గోదవారి జిల్లాకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మార్గాని నాగేశ్వర రావుతో పాటు యువరాజ్యం రాజమండ్రి నగర అధ్యక్షుడు మార్గాని భరత్ గౌడ్ కూడా రాజీనామ చేశారు.