కాకినాడ : తీర్పు తనకు అనుకూలంగా లేకపోవడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి కాకినాడ జూనియర్ సివిల్ జడ్జిపై యాసిడ్ తో ఘాతుకానికి పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జూనియర్ సివిల్ జడ్జి నాగ మారుతి శర్మపై మంగళవారం యాసిడ్ దాడి జరిగింది. గాయపడ్డ ఆయనను చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీర్పు తనకు అనుకూలంగా ఇవ్వలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి మూడో అదనపు సెషన్స్ జడ్జిపై యాసిడ్ దాడికి పూనుకున్నాడు.