నెల్లూరు : యూనిట్ పాసింజర్ రైలు సూళ్లూరు పేట వద్ద అకస్మాత్తుగా ఆగిపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక ప్రయాణీకులు భయాందోళనకు లోనయ్యారు. రైలులో విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల విద్యుత్ తీగలు తెగిపడడంతో రైలు పట్టాల మీదే ఆగిపోయింది. దీంతో ప్రయాణీకులు పరుగులు తీయడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ సంఘటనలో పలువురుకి విద్యుత్ షాక్ తగిలింది.