సబ్సిడీ విత్తనాలపై నిఘా
అనంతపురం : ఖరీఫ్ లో రైతులకు సకాలంలో వేరుశనగ విత్తనాలు అందించడానికి జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని కలెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వేరుశనగ విత్తన కాయలను కర్ణాటక రాష్ట్రానికి తరలి వెళ్ళకుండా సరిహద్దు ప్రాంతాల్లో ప్రక్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బుధవారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. గత సంవత్సరం ఖరీఫ్ లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఇప్పుడు ప్రతి కౌంటర్ దగ్గర వీడియో కవరేజీ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టాదారు రైతులు పాసు పుస్తకాలు తీసుకుని లైన్లో నిలబడిన దగ్గర నుంచి పర్మిట్ తీసుకుని వేరుశనగ బస్తాలు అందుకునే వరకు వీడియో చిత్రీకరిస్తామన్నారు. 7, 9, 11 తేదీలలో విత్తనకాయలు అందిస్తామని ఆయన తెలిపారు. వ్యవసాయశాఖా మంత్రి ఆదేశాల మేరకు రైతులందరికీ విత్తనాలు అందేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, రాయదుర్గం తదితర నియోజకవర్గాల సరిహద్దుల్లో అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
News Posted: 4 June, 2009
|