నకిలీ కరెన్సీ స్వాధీనం
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా లో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కొవ్వూరులో నకిలీ కరెన్సీ చలామణిలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా వేసి సంబంధిత ముఠానూ అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.23 లక్షల నకిలీ కరెన్సీతోపాటు ప్రింటింగ్ సామాగ్రిని, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానస్పదంగా తిరుగుతున్న కొందరు వక్యక్తులను పట్టుకుని ప్రశ్నించగా వారి వద్ద దొంగ నోట్లు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా అసలు సూత్రదారి మాత్రం పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు.
News Posted: 9 June, 2009
|