అనంతపురం : నవ మాసాలు మోసి పిల్లలను కన్న ఓ మాతృమూర్తి తన పిల్లలను అమ్మకానికి పెట్టింది. అనంతపురం జిల్లా గోర్లంటలో ఈ సంఘటన చేటు చేసుకుంది. ఓ మాతృమూర్తి తన ఇద్దరు పిల్లలను అమ్ముతుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆర్థికబాధలను తట్టుకోలేక తన పిల్లలను అమ్మకానికి పెట్టినట్లు ఆమె పోలీసుల విచారణలో తెలిపింది.