కటారుపల్లిలో ముగ్గురు మృతి
అనంతపురం : జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. గాండ్ల పెంట మండలం, కటారుపల్లి సమీపంలో లారీ, ద్విచక్రవాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 9 July, 2009
|